నెల్లూరు పెద్దిరెడ్డి చేపల పులుసు కీ ఎందుకు అంత డిమాండ్

 నెల్లూరు పెద్ద రెడ్డి చేపల పులుసు

నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఒక traditional ఆహారం మరియు ఇది చాలా ప్రాఖ్యాతి పొందిన చేపల పులుసు. ఇది రుచిగా ఉంటుంది అని తిన్నవాళ్లు చెప్తుంటారు. అయితే నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఎందుకు ఫేమస్ అయ్యింది అని ఈరోజు తెలుసుకుందాం.

నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు 

నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు తయారు చేయు విధానం

నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు తయారు చేయడానికి కావలసిన పదార్థాలు
  • చేప (కోరామిను )
  • చింతపండు
  • ఉల్లిపాయ
  • టమోటా
  • మామిడి కాయలు
ఇవి చాలా ముఖ్యమైన పదార్థాలు

తయారీ విధానం :-

ముందుగా మనం చింతపండు ని ఒక పాత్రలో వేసుకొని బాగా నానా బెట్టుకోవాలి. తరువాత మనం ఉల్లిపాయ ముక్కలు, టమోటా మామిడి అన్ని బాగా ముక్కలు చేసుకోవాలి.

ఇప్పుడు ఒక పాత్ర ని కట్టెల పొయ్యి మీద ఒకపాత్ర లో నూనె వేసుకోవాలి. అందులో ఆవాలు వేసి బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా ఫ్రై చెయ్యాలి.

అంత బాగా ఫ్రై అయినా తరువాత టమోటా మరియు మామిడి ముక్కలు వేసుకొని ధనియా పొడి మరియు కారం పొడి వేసి బాగా కలపాలి.

ఇప్పుడు మనం నానబెట్టుకున్న చింతపండు రసం పోయాలి. ఇలా 15 or 20 నిముషాలు బాగా వేడి చెయ్యాలి.

ఇప్పుడు మనం బాగా కడిగి పెట్టుకున్న చేపల ముక్కలను ఒక్కోటి ని అందులో వేయాలి. వేసిన తరువాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న మసాలా పదార్థాలు వెయ్యాలి.

చివరి సరిగా మనం డించడానికి ముందు కొత్తిమీర వెయ్యాలి. వేసిన కొంతసేపటికి మనం దించాలి.

నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఎక్కేడెక్కడ దొరుకుతుంది

నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు రెస్టారెంట్ ఎక్కడ ఎక్కడ ఉన్నాయి అంటే హైదరాబాద్ మరియు నెల్లూరు లో దొరుకుతుంది.ఇది కాకుండా రుద్రంపేట బైపాస్, కోవూరు నగర్ , అనంతపురం లో కూడా దొరుకుతుంది.




Comments

Popular posts from this blog

ఆహారం అలవాటు పరిచయం

బడి హౌస్ చిరు ధాన్యల బ్రేక్ఫాస్ట్ తిన్నారా ఎప్పుడు అయినా